బాహుబలి సినిమాతో ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఐదేళ్లు బాహుబలి సినిమా కోసం కష్టపడిన ప్రభాస్ అంతకుమించి క్రేజ్ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. అందుకే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా మీద నేషనల్ మీడియా కన్ను ఉంది. సుజిత్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.


ఇదిలాఉంటే సాహో తర్వాత ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జిల్ ఫేం రాధాకృష్ణ ఆ సినిమా డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు స్టార్ డైరక్టర్ అసిస్టెంట్స్ రెడీ అవుతున్నారట. కొత్తవారికి అవకాశం ఇవ్వడంలో ముందు ఉండే ప్రభాస్ రాజమౌళి అసిస్టెంట్ కృష్ణకు సినిమా ఇస్తానని మాటిచ్చాడట.


బాహుబలి టైంలో కృష్ణ పనితీరుకి ఇంప్రెస్ అయిన ప్రభాస్ తనతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట. ప్రభాస్ కు కృష్ణ ఇప్పటికే ఓ అద్భుతమైన కథ కూడా చెప్పాడట. ఇక అతనే కాదు స్టార్ డైరక్టర్స్ అయిన కొరటాల శివ, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఒకరిద్దరు అసిస్టెంట్ డైరక్టర్స్ కూడా ప్రభాస్ కోసం కథలు సిద్ధం చేశారట.


కొత్తవారికి ఛాన్సులు ఇస్తూ వారి ప్రతిభను గుర్తిస్తున్న ప్రభాస్ ను నిజంగా మెచ్చుకోవాల్సిందే. సాహో, జాన్ తర్వాత ప్రభాస్ సినిమాలు వీరితోనే ఉంటాయని తెలుస్తుంది. అయితే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం చేస్తున్న సినిమాల మీద దృష్టి పెట్టాడు ప్రభాస్.
 


మరింత సమాచారం తెలుసుకోండి: