రామ్ గోపాల్ వర్మ పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ పై వేసిన సెటైర్లు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. పుల్వామా సంఘటనలో చనిపోయిన సైనికుల త్యాగాలకు చెలించిపోతు సామాన్యుల నుండి సెలెబ్రెటీల వరకు పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పై చేస్తున్న మాటల దాడిలో రామ్ గోపాల్ వర్మ కూడ చేరి తనదైన రీతిలో ఈ విషయం పై స్పందించాడు.
చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఇమ్రాన్ మాటలను ఉద్దేశించి ‘అదే నిజమైతే మీ జీవితంలో మూడు పెళ్లిళ్ల అవసరం వచ్చేది కాదు’ అని ఇమ్రాన్ ను ఉద్దేసించి వేసిన సెటైర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అంతేకాదు ఆర్డీఎక్స్ బాంబు పెట్టుకుని దాడి చేయబోతున్న మనిషితో చర్చలు ఎలా చేయాలో నేర్పిస్తే భారతీయులు అందరూ ట్యూషన్ ఫీజు చెల్లించి మరీ నేర్చుకుంటామని మరో సెటైర్ వేసాడు వర్మ.
దీనితో ఎక్కువగా బూతు విషయాల పై స్పందించే వర్మకు ఇంత దేశభక్తి ఎక్కడ వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తూ వర్మ మారిపోయాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ‘అమెరికా చెప్పే దాకా ఒసామా బిన్ లాడెన్ మీ దేశంలో ఉన్నాడని మీరే తెలుసుకోలేని మీది ఏ దేశమో చెప్పండి’ అంటూ ఏకంగా పాకిస్తాన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు వర్మ.
దీనితో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయాలను మర్చిపోయి వర్మ బోర్డర్ సమస్యలు గురించి మాట్లాడుతున్నాడా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. అయితే వర్మ పెట్టిన ఈ ట్విట్ చూసి మరికొందరు ఇమ్రాన్ ఖాన్ కు ఇంగ్లీష్ వచ్చో లేదో తెలుసుకున్నావా వర్మ అంటూ మరికొందరు ఇమ్రాన్ ఖాన్ కు ఇంగ్లీష్ రాదేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా వర్మలో వచ్చిన మార్పు అందరికీ చాల ఆసక్తిని కలిగిస్తోంది..