టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది ‘ఖుషి’. తమిళ డైరెక్టర్ సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాన్, భూమిక నటించిన ‘ఖుషి’ఓ ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ లవర్ బాయ్ గా బాగా ఆకర్షించాడు. సినీ పరిశ్రమ అంటే హీరోయిన్లు గ్లామర్ ప్రదర్శన చేయాల్సిన ఈ సమయంలో చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ తెలుగు - తమిళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించింది భూమిక. ఈమె తెలుగు లో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా.. అవి ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టేశాయి.
బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన భూమిక భరత్ ఠాకూర్ తో వివాహమైన తరువాత నటనకు దూరమైంది. 'ఖుషీ' .. 'ఒక్కడు' .. 'సింహాద్రి' .. 'మిస్సమ్మ' సినిమాలు యూత్ లో ఆమె క్రేజ్ ను అమాంతంగా పెంచేశాయి. ఆ మద్య నాని నటించిన ‘ఎంసీఏ’సినిమాలో వదిన పాత్రలో నటించింది. అయితే భూమిక రీ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే కారణం అంటూ వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఆమె తెలుగు .. తమిళ భాషల్లో తనకి గల పరిచయాలతో మరిన్ని అవకాశాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోందట. తన భర్త చేస్తోన్న వ్యాపారాల్లో భారీగా నష్టాలు రావడంతో, తాను తిరిగి సినిమాల్లో బిజీ కావాలనే ఉద్దేశంతోనే భూమిక ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రీఎంట్రీలో భుమికకు అక్క, వదిన క్యారెక్టర్స్లో నటిస్తు ఫుల్ బిజీగా మారింది.
భూమిక రీఎంట్రీ తరువాత నాని,నాగచైతన్య వంటి హీరోలతో కలిసి నటించింది. అయితే ఈ వార్తల్లో ఎంత వాస్తం ఉందో తెలియదు కానా..ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన అందాల భామ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.