నిజానికి ఒక్కో సందర్భంలో ఏదైనా సినిమాకు ఫలానా హీరో, లేదా హీరోయిన్ ను తొలుత తీసుకుని, ఆ తరువాత కొన్ని కారణాల వలన వారి స్థానంలో మరొకరిని తీసుకుని సినిమాలను తెరకెక్కించిన ఘటనలు సినిమా ఇండస్ట్రీలో అక్కడక్కడ కొన్ని జరిగాయి. అయితే వాటిని ఎక్కువమంది పెద్దగా లక్ష్య పెట్టనప్పటికీ, కొందరు మాత్రం అటువంటి అవకాశాలు చేజారినందుకు ఎంతో బాధపడుతుంటారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లు లేక ఢీలాపడింది.

ఆమె  ఎంతో ఆశపెట్టుకుని ఇటీవల కార్తితో కలిసి నటించిన దేవ్ సినిమా కూడా బోల్తాకొట్టడంతో అమ్మడు మనసులో తీవ్ర వేదన మొదలయిందట. నిజానికి రకుల్ తమిళ్ మరియు హిందీ చితసీమల్లో మాత్రం మంచి అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఇకపోతే ఆమెను ఇటీవల వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జై లెవకుశ దర్శకుడు, బాబీ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కనున్న వెంకీ మామా సినిమాలో ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. 


అయితే మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదుగానీ, హఠాత్తుగా ఆమె స్థానంలో 'నన్ను దోచుకుందువటే' ఫేమ్ నభ నటేష్ ను ఎంపిక చేసినట్లు ఆ సినిమా యూనిట్ నేడు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇలా చేయడం తమ హీరోయిన్ రకుల్ ను ఘోరంగా అవమానించడమే అని రకుల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రకుల్ కూడా అంత మంచి ఆఫర్ మిస్ అవడంతో కొంత మధనపడుతోందట. మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఏదైనా మనకు పేరు, క్రేజ్ ఉన్నంతవరకు మన కాళ్ళ దగ్గరకు వస్తుంది, అదే అవన్నీ తగ్గిపోగానే అవకాశాలు కూడా వచ్చినట్లే వచ్చి, ఒక్కసారిగా చేజారిపోతుంటాయి అనడానికి రకుల్ విషయంలో జరిగిన ఈ ఘటనే సాక్ష్యం అని చెప్పవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: