టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కన్నీరు పెట్టుకున్నారు.  నేడు క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’సినిమా పలువురు సినీ పెద్దలు వీక్షించారు.  ఈ షోకు బాలయ్య అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎన్టీఆర్ చిత్రబృందంతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివి వినాయక్, పూరి జగన్నాధ్, చార్మి , తమ్మారెడ్డి భరద్వాజ్, యస్ గోపాల్ రెడ్డి, సురేశ్ బాబు, యువ దర్శకులు వెంకీ అట్లూరి, అజయ్ భూపతి, చందు, నాగ అశ్విన్, పరుచూరి గోపాలకృష్ణ వీక్షించారు. 

మూవీ విక్షించిన తర్వాత పలువురు సినిమాపై తమ అభిప్రాయాలు తెలియజేశారు.  ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..తనకు 'కథానాయకుడు' సినిమా కంటే 'మహానాయకుడు' సినిమా చాలా ఎక్కువ నచ్చిందని     పూరి జగన్నాథ్ చెప్పారు. బసవతారకంతొ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ విని తాను ఏడ్చానని తెలిపారు. మహానాయకుడు' సినిమా ఎంత గొప్పదో... బాలయ్య నటన కూడా అంతే గొప్పదని అన్నారు.

బాలయ్యబాబు కెరీర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పారు. నాన్నగారి మీది ప్రేమతో ఎంతో ఇష్టంతో ఈ సినిమా చేశారని చెప్పారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ కు జరిగిన సన్నివేశం చూసి వెక్కవెక్కి ఏడ్చానని చెప్పారు. ఈ మధ్యకాలంలో తాను కంటతడి పెట్టిన సందర్భం ఇదేనని చెప్పారు.  'థాంక్యూ బాలా' అంటూ పక్కనే ఉన్న బాలయ్యను అభినందించి, హత్తుకున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎన్ బి కె ఫిలిమ్స్ తో పాటు, వారాహి ప్రొడక్షన్స్,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: