ఈరోజు విడుదల అయిన ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం ‘మహానాయకుడు’ మూవీ పై లక్ష్మి పార్వతి ఘాటైన సెటైర్లు వేసారు. తాను ఈ సినిమాను చూడ నప్పటికీ తనకు ఈ సినిమాకు సంబంధించిన చాల విషయాలు తెలిసాయి అంటూ ఈమూవీ ఎన్టీఆర్ బయోపిక్ లాగా లేదని అందరూ అంటున్నట్లు లక్ష్మీపార్వతి సెటైర్లు వేసారు. అంతేకాదు ఈసినిమా మొత్తం చంద్రబాబు గొప్పతనమే చూపించారని అంటూ ఎన్టీఆర్ బయోపిక్ లో వాస్తవాలు చూపించే ధేర్యం బాలకృష్ణకు లేదు అంటూ కామెంట్స్ చేసారు. 
బాలయ్యకు ఆ ధైర్యమే లేదు
ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా తెరకెక్కించినా ఎక్కడా  ప్రస్తావన లేకుండా తనను చూపిస్తే ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని కూడా చూపించాలి కాబట్టి ఆ సాహసం చేసే ధైర్యం బాలకృష్ణకు లేదు అంటూ ఆమె అభిప్రాయ పడ్డారు.  అంతేకాదు ఈ మూవీలో వాస్తవాలు లేవు కాబట్టే ప్రజలు కూడా సరైన తీర్పు ఇస్తారని లక్ష్మి పార్వతి అభిప్రాయ పడింది.
అందుకే నా ప్రస్తావన లేదు
మహానాయకుడు’ ఒక విధంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఉపకారం చేసింది అంటూ ‘మహానాయకుడు లో వాస్తవాలు లేవు కాబట్టి జనం వాస్తవికతతో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను బాగా చూస్తారని పరోక్షంగా ‘మహానాయకుడు’  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు ఉపకారం చేసిందని ఆమె అభిప్రాయపడుతోంది. అంతేకాదు ఈ మూవీ ట్రైలర్ కు దాదాపుగా కోటి వ్యూస్ వచ్చిన నేపధ్యంలో జనం అంతా వాస్తవ్వలు ఉండే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి ఎదురు చూస్తున్న విషయాలను ఆమె వివరించారు. 
లక్ష్మీస్ ఎన్టీఆర్
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో లక్ష్మి పార్వతి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ మరణం వరకు కొనసాగే ఈమూవీతో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన సినిమాల హడావిడి పూర్తి అవుతుంది. దీనితో ఎన్టీఆర్ జీవితం పై సినిమాలు తీసే ప్రయత్నాలు బాలకృష్ణ చేస్తే ఈ మూవీల ముగింపు ఫినిషింగ్ టచ్ రామ్ గోపాల్ వర్మ ఇవ్వడం యాదృచ్చికం అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: