ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకేసారి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన సినిమాలు వస్తున్నాయి.  క్రిష దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్’బయోపిక్ నుంచి రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల అయ్యాయి.  సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది..కానీ పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది.  నేడు ఎన్టీఆర్ మహానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  మరో వైపు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 
Image result for ntr mahanayakudu
ఈ సినిమాకు సంబంధించి ఫోటోలు, టీజర్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  అయితే ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి సంబంధించిన ట్రైలర్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు ’ రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో ఇంట్రవెల్ లో రిలీజ్ చేస్తానని ఆ మద్య తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.   'ఎన్టీఆర్ మహానాయకుడు' టికెట్ కొనండి.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ను ఉచితంగా చూడండి..ఫ్రీ ఫ్రీ ఫ్రీ అంటూ ఊదరగొట్టారు.  దాంతో టీజర్ చూస్తేనే ఇలా ఉంది..ఇక ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకులు తెగ క్యూరియాసిటితో ఎదురు చూశారు.
Image result for ntr mahanayakudu laxmis ntr
కానీ వర్మ అన్నట్టు ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ ఇంట్రవెల్ మద్య ఎలాంటి ట్రైలర్ లేకపోవడంతో ప్రేక్షకులు ఒకంత ఆశ్చర్యపోవడమే కాదు ఈ వర్మ ఇంతే..ఇక మారడు అంటూ కామెంట్స్ చేశారు.   'ఎన్టీఆర్ మహానాయకుడు' టీమ్ పై జాలిపడ్డాడా లేదా భయపడ్డాడా? ఆ రేంజ్ హడావుడి చేసి తీరా థియేటర్లోకి జనాలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తుస్ మనిపించడం ఒక్క వర్మకే సాద్యమైందని నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు.  అయితే దానికి కూడా ఏదో ఒక కారణం చెబుతూ వర్మ మరో ట్విట్ చేస్తారేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: