టాలీవుడ్లో తండ్రీ కొడుకులతో సినిమాలు చేసిన వారు కొద్ది మందే ఉన్నారు. అటువంటి వారిలో మొదటి స్థానం అందాల తార శ్రీదేవిదే. ఆ తరువాత కాజల్ వచ్చింది. ఆమె అటు మెగాస్టార్ చిరంజీవితోనూ, కొడుకు రాం చరణ్ తోనూ నటించింది. ఇక బాలక్రిష్ణతో చేసిన రాధ అన్న గారు నందమూరితో చండశాసనుడు మూవీలో ఆడి పాడింది. అలాగే మరో తార  అగ్నిహోత్రి కూదా అన్న నందమూరి తోనూ, కొడుకు బాలక్రిష్ణతోనూ నటించింది. మరి ఇప్పటి తరంలో సీనియర్లతో చేసిన వారు ఎవరూ లేరు కాబట్టి పాత రికార్డులు అలాగే ఉండిపోతున్నాయి.


లేటేస్ట్ గా ఓ న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే నాగ చైతన్యతో జోడీ కట్టాల్సిన రకుల్ ఇపుడు తండ్రి నాగార్జున మూవీలో జంటగా మారిందట. మొదట వెంకీమామ మూవీ కోసం రకుల్ ని తీసుకున్నారట. ఆ తరువాత ఏమైందో ఏమో రకుల్ ప్లేస్ లో రాశీ ఖన్నాకు చాన్స్ ఇచ్చేశారు. దాంతో రకుల్  ని నాగ్ ఆదుకున్నారట. తన మూవీ మన్మధుడు 2 లో రకుల్ కి చాన్స్ ఇచ్చారట. అదే జరిగితే రకుల్ కి ఓ రికార్డే మరి.


ఇక ఇప్పటికే రకుల్ నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం అన్న మూవీలో జంట కట్టింది. మరి నాగ్ తో కనుక నటిస్తే ఆమె కూడా కాజల్, శ్రీదేవి బ్యాచ్ లోకి వెళ్తుంది. ఇదిలా ఉండగా ఇక్కడ ఇంకో విషయం ఉంది. నాగార్జున తన తండ్రి హీరోయిన్ శ్రీదేవితో నటించారు, అలాగే తన కొడుకు రకుల్ తో నటిస్తే ఆయనది అసలైన రికార్డ్ అంటున్నారు ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: