తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది.  ఈ విషయంపై ఆయన మేనేజర్ నేడు పోలీసులను ఆశ్రయించారు.  సుమారు లక్ష రూపాయలు, నగలు చోరీకి గురయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.  అయితే తమ ఇంట్లో పనిచేసే పనిమనిషపైనే అనుమానాలు ఉన్నట్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది..అయితే ఆ దొంగ చిరంజీవి ఇంట్లో చాలాకాలం నమ్మకంగా పనిచేయడం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా మోహన్ బాబు ఇంట్లో చోరీ చేసిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని..నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామని పోలీసులు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: