ఈమధ్య కాలంలో సెలెబ్రెటీలకు తమకు సినిమాలలో వచ్చే పారితోషికం కంటే బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా వచ్చే సంపాదన ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత తరం తారల నుండి మాజీ తారల వరకు వివిధ వస్తువులకు సంబంధించిన ప్రకటనలలో నటించడానికి విపరీతమైన ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ విషయమై తమకు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో సహకరించడానికి చాలామంది స్టార్స్ ముంబాయిలో ప్రముఖ యాడ్ ఏజెన్సీస్ సహకారం కోరుతూ వారికి తమ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో కమీషన్స్ కూడ ఇస్తున్నారు.
Rambha
ఇలాంటి పరిస్థుతులలో ఈ ప్రకటనల విషయంలో ఒకనాటి గ్లామర్ హీరోయిన్స్ రాశి రంభలకు ఏర్పడిన కోర్టు సమస్యలు టాప్ హీరోలను కూడ కలవర పెడుతున్నట్లు టాక్. కలర్స్ సంస్థకు ప్రచార కర్తలుగా రంభ రాశి లు వెయిట్ లాస్ కు సంబంధించి చెప్పిన మాటలు నమ్మి ఆ సంస్థలో తాను ట్రీట్మెంట్ తీసుకుని తన బరువు తగ్గకపోగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నాను అంటూ సత్యవతి దేవి అనే మహిళ విజయవాడ వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించినప్పుడు ఆ ఫోరమ్ జడ్జి ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.
Actress Rambha Family Photo
కలర్స్ సంస్థకు సత్యవతిదేవి చెల్లించిన 74,652 ల మొత్తానికి 9 శాతం వడ్డీతో వెంటనే చెల్లించాలని జడ్జి ఆదేశించడమే కాకుండా వినియోగదారుల సంక్షేమ నిధికి 2 లక్షలను జరిమానా చెల్లించాలని తీర్పు ఇస్తూ రాశి రంభలు ఇలాంటి  ప్రకటనలను ఆపాలని తీర్పు ఇచ్చారు. వాస్తవానికి ఈ వివాదంలో రాశి రంభలు ప్రతివాదులు కాకపోయిన తప్పుడు ప్రచారంతో ప్రొత్సహించడం ద్వారా  వీరిద్దరూ సామాన్యులకు జరిగే నష్టానికి కారణం అయ్యారు అని జడ్జి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
రాశి లేటెస్ట్ గ్యాలరీ
ఒక సెలెబ్రెటీ హోదాలో ఉన్న వ్యక్తులు జనానికి నిజం చెప్పాలి కాని అసత్యాలు ప్రచారం చేస్తే ఎలా అంటూ ఆ న్యాయమూర్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనితో ప్రస్తుతం టాప్ హీరోలు అనేక బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా కొనసాగుతున్న నేపధ్యంలో ఆ బ్రాండ్స్ విషయంలో ఏమైనా తేడా జరిగి వినియోగ దార్లకు నష్టం ఏర్పడితే టాప్ హీరోలకు కూడ ఇదే పరిస్థితి ఏర్పడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: