‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఇపుడు తన స్పీడ్ పెంచింది. అన్నగారి జీవిత చరిత్ర అంటూ తనయుడు బాలక్రిష్ణ తీసిన రెండు భాగాల్లో మసాలా అందని జనం ఈ మూవీ కోసం ఆసక్తిగా చూస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఈ రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపించలేని పరిస్తితి. దీంతో ఇపుడు అందరి కళ్ళు  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మీదనే ఉన్నాయి. 


తన మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు రాం గోపాల్ వర్మ తొలి సాంగ్ వీడియో విడుదల చేశాడు. సిరాశ్రీ లిరిక్స్ అందించిన  నీ ఉనికి  అనే పాటను ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం ఆలపించారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఇంట్లోకి, ఆ తరువాత ఆయన జీవితంలోకి ఎంటర్ కావడం వంటి సన్నివేశాలను ఇందులో చూపారు. కళ్యాన్ మాలిక్ సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీలో యజ్ఞాశెట్టి లక్ష్మీ పార్వతి రోల్ లో నటించింది. 


పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల నటుడు ఎన్టీఆర్ పాత్రలో నటించగా.. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ కనిపించనున్నాడు. నాడు ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ లో ప్రధాన ఘట్టమైన వైస్రాయ్ హోటల్ ఘటనను  ఈ మూవీలో చూపడం విశేషం. మొత్తానికి ఈ మూవీ అయినా అన్న గారి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తారేమోనని జనం నమ్ముతున్నారు. మరి రామ్ గోపాల వర్మ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: