సినిమా సెలిబ్రిటీలకు వారి అభిమానుల మితిమీరిన ప్రవర్తనతో ఇబ్బంది పాలు అయిన సంఘటనలు గతంలో చాల జరిగాయి. లేటెస్ట్ గా బాలీవుడ్ బ్యూటీ ఎవ్లీన్ శర్మకు 'సాహో' షూటింగ్ సందర్భంగా చేదు అనుభవం ఎదురు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెను ఒక వీరాభిమాని వెంటాడి వేధించడం వల్ల ఎవ్లీన్ శర్మకు ఈ హించని సమస్యలు ఎదురు అయినట్లు తెలుస్తోంది.
తెలుస్తున్న సమా చారం మేరకు హైదరాబాద్ లో జరుగుతున్న సాహో షూటింగ్ కోసం ఎవ్లీన్ శర్మ ముంబై నుండి వచ్చి షూటింగ్లో పాల్గొంటోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్లో విలన్ నీల్ నితిన్ ముఖేష్ తో కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న ఈ బ్యూటీ తన షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత రామోజీ ఫిలిం సిటీలోని హోటల్ కు ఎవ్లీన్ శర్మ బయలుదేరినప్పుడు ఈమె వెళ్లడాన్ని గమనించిన ఓ అభిమాని ఆమెను వెంబడించాడు అని తెలుస్తోంది.
ఆతరువాత ఆమె హోటల్ కు చేరుకున్న తరువాత లాబీలో ఆ అగంతకుడు ఆమె కోసం కొన్ని గంటలపాటు వేచి ఉండటం సిబ్బంది గమనించారు. అయితే ఏకంగా హీరోయిన్ రూమ్ నెంబర్ కోసం ప్రయత్నించడంతో హోటల్ సిబ్బందికి అనుమానం బలపడి అతడిని లోతుగా విచారించడంతో అతడు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం హోటల్ సిబ్బందిని ఖంగారు పెట్టినట్లు సమాచారాం. అయితే ఈ విషయమై ఎలాంటి గొడవ జరుగకుండా ఆ అభిమానిని హోటల్ పరిసర ప్రాంతం నుంచి బయటకు పంపేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం తన మేనేజర్ ద్వారా తెలుసుకున్న ఎవ్లీన్ శర్మ చాలా టెన్షన్ పడి తనలాంటి సెలెబ్రెటీలకు కూడ ఆకతాయిల నుండి వేధింపులు ఎదురౌతూ ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి అంటూ సోషల్ మీడియాలో ఈ విషయం పై స్పందించింది. దీనితో ఆమెను వెంటాడిన ఆ అగంతకుడు ఎవరు అంటూ ఆమె అభిమానులు ఆమెకు వారి సంఘీ భావాన్ని తెలియచేస్తున్నారు..