నందమూరి హీరోలు బాబాయ్ అబ్బాయ్ లు మరోసారి కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు. హరికృష్ణ మరణించిన తర్వాత బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ లు దగ్గరయ్యారు. ఈ ఇద్దరికి కామన్ గా కళ్యాణ్ రాం మధ్య వర్తిత్వం చేస్తూ వచ్చాడు. అయితే హరికృష్ణ మరణం తర్వాత బాబాయ్ గా కళ్యాణ్ రాం, ఎన్.టి.ఆర్ లకు బాలయ్య కూడా సపోర్ట్ గా ఉన్నాడు.


ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఈవెంట్ లో నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా ఎన్.టి.ఆర్ కూడా అటెండ్ అయ్యాడు. అరవింద సమేత రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ గెస్ట్ గా వచ్చాడు. అయితే ఎన్.టి.ఆర్ రెండు పార్టులు రిలీజైనా సరే ఎన్.టి.ఆర్ కనీసం ఆ సినిమాలను ప్రస్థావిస్తూ ఓ ట్వీట్ కూడా వేయలేదు.


మళ్లీ బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. అయితే మళ్లీ వాళ్లిద్దరిని కళ్యాణ్ రాం కలుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 118 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాబాయ్, అబ్బాయ్ ఇద్దరు అటెండ్ అవనున్నారని తెలుస్తుంది. కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 25 సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. 


సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, షాలిని పాండే ఇద్దరు హీరోయిన్స్ నటించారు. మార్చి 1న రిలీజ్ అవబోతున్న 118 సినిమా కళ్యాణ్ రాం కు తప్పకుండా హిట్ ఇచ్చేలా ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: