ఎన్టీఆర్ బయోపిక్ నందమూరి బాలకృష్ణ తీస్తానని ప్రకటించినప్పుడు దర్శకుడిగా తేజాను అనుకున్న సంగతి తెలిసిందే. కొంత కథా చర్చల అనంతరం తేజా దర్శకుడిగా సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది కూడా. ఆ వేడుకకు సినీలోకమంతా తరలివచ్చింది.



కానీ ఉన్నపళంగా ఎందుకో తేజాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పించారు... లేదు..లేదు.. తానే ఈ భారం మోయలేనని తేజాయే తప్పుకున్నాడని బాలయ్య టీమ్ చెప్పుకొచ్చింది. మొత్తానికి క్రిష్ దర్శకత్వంలో మళ్లీ ప్రాజెక్టు కదిలింది. గతంలో క్రిష్ తీసిన చిత్రాల ఆధారంగా ఈ సినిమా చాలా బాగా వస్తుందని అంతా అనుకున్నారు.

teja vs krish కోసం చిత్ర ఫలితం


కానీ అనూహ్యంగా.. అన్ని హంగులూ ఉన్నా.. ఎన్టీఆర్ బయోపిక్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సెకండ్ పార్ట్ మహానాయకుడు అయితే బాలయ్య హిస్టరీలోనే అత్యంత చెత్త వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది కూడా. ఈ సమయంలో తేజా తీసుకున్న నిర్ణయంపై చర్చ మొదలైంది.

సంబంధిత చిత్రం


కథను ఇష్టం వచ్చినట్టు మార్చడమే.. ఈ రెండు సినిమాల పరాజయానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి అడ్డగోలు మార్పులకు తేజా తలొగ్గకపోవడం వల్లే అతన్ని తప్పించారని ఇప్పుడు భావిస్తున్నారు. మొత్తానికి తేజా ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకుని మంచి పనే చేశాడని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. పాపం క్రిష్ మాత్రం ఇరుక్కుపోయాడని సానుభూతి తెలుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: