బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, డైరెక్టర్ క్రిష్ మధ్య వివాదం కొన్నిరోజులుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక సినిమా దర్శకత్వం విషయంలో వీరి మధ్య గొడవ మొదలైంది. క్రిష్ సినిమా పూర్తి చేసి వస్తే.. కంగనా దాన్ని రీషూట్ చేసి.. తాను దర్శకురాలిగా పేరు వేసుకుంది.

kangana and balakrishna కోసం చిత్ర ఫలితం


ఈ విషయంలో వీరి మధ్య ఘాటు ఘాటు మాటల యుద్ధాలే జరిగాయి. ఇక ఇప్పుడు కంగనా క్రిష్ ను టార్గెట్ చేసుకుని బాలయ్యపై జాలిపడింది. మహానాయకుడు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ ఇష్యూలో క్రిష్ ను టార్గెట్ చేసింది.

సంబంధిత చిత్రం


ఎన్టీఆర్ మహానాయకుడు’ కలెక్షన్ల రిపోర్ట్‌ గురించి విన్నాను. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణ సర్‌ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో నేను ‘మణికర్ణిక’ ప్రాజెక్టును స్వీకరించినపుడు నాపై ఎటాక్ చేసి.. నన్ను హింసించి నేనేదో క్రిష్‌ను మోసం చేసినట్లు నాపై నిందలు వేసి రాంబదుల్లా నన్ను పీక్కుతిన్నారు.

సంబంధిత చిత్రం


మరి ఇప్పుడు ఏమంటారు...? క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా ‘మణికర్ణిక’పై దుష్ప్రచారం చేశాయి. మన స్వాతంత్ర్య సమరయోధులు దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందించినందుకు నాకు చాలా బాధగా ఉంది’ అంటూ కంగన విమర్శలు గుప్పించింది. మొత్తానికి బాలయ్యపై జాలిపడుతూనే క్రిష్ ను కంగనా టార్గెట్ చేసి కసితీర్చుకుందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: