టాలీవుడ్లో ఇపుడు మేకింగులో ఉన్న మూవీస్ లో ఇంటెరెశ్తింగ్ మూవీగా సైరా అగ్రభాగంలో ఉంది. ఆ మూవీ గురించి వచ్చే అప్ డేట్స్ మెగా ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఖైదీ నంబర్ 150 చేశారు. ఆ తరువాత ఇపుడు సైరా అంటూ స్వాతంత్ర సమర యోధుడు కధను ఎంచుకున్నారు. ఆ మూవీ కోసం దాదాపుగా ఏడాది పైగా చిరు టీమ్  కష్టపడుతోంది.


సైరా మొదట ఈ ఏడాది సంక్రాంతికి అనుకున్నారు. అ తరువాత  సమ్మర్ అన్నారు.  మళ్ళీ అక్టోబర్ దసరా అన్నారు. ఇపుడు మళ్ళీ ఓ గుడ్ న్యూస్ చెబుతున్నారు. సైరా మూవీ ఆగస్ట్ లోనే వస్తోందట. ఈ మూవీకి సంబంధించిన వర్క్ మొత్తం తొందరలొనే కంప్లీట్ చేయడానికి  యూనిట్ రెడీ అవుతోంది. ఆ తరువాత ఈ మూవీని సాధ్యమైనంత వేగంగా ధియేటర్లలోకి తేవాలనుకుంటోంది.


అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆగస్ట్ కి సైరా మూవీ రావచ్చునని అంటున్నారు. నయనతార, మెగాస్టార్ పక్కన తొలిసారి నటించిన ఈ మూవీలో చిరు తమ్ముడు కూతురు నీహారిక కూడా ఓ పాత్ర వేసింది. ఇక ఈ మూవీలో మిల్కీ బేబీ తమన్నా కూడా మెరవనుంది. ఈ ఏడాదికి టాలీవుడ్లో సరైన మూవీ లేదు. ఇప్పటికి హిట్టు కూదా ఎఫ్ 2 తప్ప మరేం లేదు. మహేష్ మూవీ మహర్షి వస్తే చూడాలి. ఆ తరువాత ఆశలన్నీ సైరా మీదనే ఉన్నాయి. మరి చూడాలి సైరా సంచలనం ఏంటో.


మరింత సమాచారం తెలుసుకోండి: