సర్జికల్ స్ట్రైక్ తరువాత మనదేశంలో యుద్ధ వాతావరణం పెరిగి పోవడంతో ప్రస్తుతం అందరు వారివారి వ్యక్తిగత సమస్యల గురించీ అదేవిధంగా దేశంలో పెరిగిపోతున్న అవినీతి గురించి పట్టించుకోకుండా భారతదేశం అంతా వ్యాపించిన యుద్ధ మేఘాల నేపధ్యంలో సరిహద్దులలో మన కోసం పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తూ భారత జాతి యావత్తు దేశభక్తిని చాటుకుంటోంది. ఇలాంటి పరిస్థుతులలో మహేష్ నిర్మాతగా నిర్మిస్తున్న ‘మేజర్’ మూవీ వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.
Adivi Sesh
నవంబర్ 26 ముంబాయ్ దాడుల నేపధ్యంలో నిర్మిస్తున్న ఈమూవీ పాకిస్తానీ ఉగ్ర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎన్.ఎస్.జీ. కమాండో ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఆధారంగా ఈమూవీ తీస్తున్నారు. ఉన్ని కృష్ణన్ పాత్రలో అడవి శేషు నటిస్తున్నాడు. వాస్తవానికి అడవి శేషు ‘గూఢచారి 2’ తీయాలని ప్రయత్నాలు చేస్తూ మహేష్ దగ్గర నుండి ఈమూవీ ఆఫర్ రాగానే ఆ ప్రయత్నాలు ఆపి ‘మేజర్’ మూవీ ప్రాజెక్ట్ వైపు వెళ్ళినట్లు తెలుస్తోంది. 
adivi sesh
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ఈమూవీ తీయడానికి సంబంధించి ‘మేజర్’ ఉన్ని కృష్ణన్ జీవితానికి సంబంధించి చాల రిసర్చ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీని వాస్తవ సంఘటనలతో ఉద్వేగ పూరితంగా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీని తెలుగు హిందీ భాషలలో ఒకేసారి నిర్మిస్తున్నారు. 
story-behind-adivi-sesh-failure-as-a-director_g2d
నిన్న ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో ప్రస్తుతం నెలకొని ఉన్న యుద్ధ వాతావరణంతో ఈమూవీ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ గా మారింది. ఇప్పటికే విలక్షణ నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న అడవి శేషు కెరియర్ కు ఈమూవీ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: