ఈ మద్య టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ లు వస్తున్న విషయం తెలిసిందే. మహానటి తర్వాత క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్లో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. కానీ ఈ సినిమా అనున్న అంచనాలు అందుకోలేపోయింది. రెండు భాగాల్లో ఎన్టీఆర్ కథానాయకుడు కాస్త పరవాలేదు అనిపించినా..ఎన్టీఆర్ మహానాయకుడు భారీ డిజాస్టర్ అయ్యింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథా ఆధారంగా మహి వి రాఘవ తీసిన ‘యాత్ర’సూపర్ హిట్ అయ్యింది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించారని ప్రేక్షకుల కితాబు ఇచ్చారు.
అప్పటి వరకు ప్రతి పక్ష హోదాలో ఉన్న వైఎస్సార్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పొందారు..ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చి ప్రజానాయకుడు అనిపించుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మహి వి రాఘవ . యాత్ర అనే టైటిల్తో రాజశేఖర్ రెడ్డి బయోపిక్ని తెరకెక్కించగా, ఇందులో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాడు.
ఇక ఇప్పుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో ఓ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాడట మహి వి రాఘవ. ఇటీవల దుల్కర్కి స్టోరీ లైన్ వినిపించగా, దానికి ఇంప్రెస్ అయిన మలయాళ హీరో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. ఆ మద్య తెలుగు లో ఓకే బంగారం అనే డబ్బింగ్ సినిమా, మహానటి లో జెమినీ గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాడు దుల్కన్. ప్రస్తుతం తమిళం, మలయాళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.