అసలేమాత్రం ఫాంలో లేని పూరి జగన్నాథ్ ఇప్పుడంటే ఇలా ఉన్నాడు కాని మూడేళ్ల క్రితం వరకు అతనో స్టార్ డైరక్టర్. పవన్, మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రాం చరణ్ ఇలా అందరితో సినిమాలు చేసిన దర్శకుడు ఆయన. మహేష్ పోకిరితో ఇండస్ట్రీ రికార్డులు అదరగొట్టిన పూరి ఆ తర్వాత అతనితో బిజినెస్ మ్యాన్ సినిమా చేశాడు. 


మహేష్ కోసం పూరి జనగణమన సబ్జెక్ట్ ఒకటి రాసుకున్నాడు. కథ మహేష్ కు వినిపించాడు సక్సెస్ ఫాంలో ఉంటే పూరితో ఆ సినిమా మహేష్ చేసేవాడు కాని పూరితో ఇప్పుడు సినిమా అంటే కష్టమని భావించి హోల్డ్ లో పెట్టాడు. జనగణమన టైటిల్ తోనే ఓ ఇంటెన్స్ తెలియచేస్తున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.


అయితే ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య జరుగుతున్న గొడవల దృష్ట్యా పూరి ఇదే కరెక్ట్ టైం అనుకుని జనగణమన సినిమాలోని డైలాగ్ ఒకటి వదిలాడు. ‘డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ .. ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా? ఆ పని మనమెందుకు చేయడం లేదు? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని మిగతా దేశాలు భయపడుతూ చావాలి.. STRENGTH LIES IN ATTACK, NOT IN DEFENCE’’..  ఇది డైలాగ్.. పూరి మార్క్ డైలాగ్ గా అనిపిస్తున్న ఈ డైలాగ్ ప్రస్తుతం బాగా ఎక్కేస్తుంది.  


చూస్తుంటే పూరి చెబుతున్నట్టుగా జనగణమన మీద బాగానే వర్క్ చేసినట్టు ఉన్నాడు. మరి మహేష్ కాస్త టైం చూసుకుని ఫుల్ స్క్రిప్ట్ విని సినిమా చేస్తే బాగానే ఉంటుంది. ప్రస్తుతం పూరి ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా హిట్టైతే ఒకవేళ మహేష్ తన ఆలోచన మార్చుకుని పూరితో సినిమా చేస్తాడేమో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: