తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ రియాల్టీ షో బాగా పాపులర్ అయ్యింది. ఇక సెకండ్ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వచ్చారు. అయితే బిగ్ బాస్ సీజన్ 2 మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేంద్రంగా ఉంటూ వచ్చింది. బిగ్ బాస్ ఇంటి సభ్యుల మద్య మాటల యుద్దం..ఒకానొక దశలో ఫిజికల్ గా కూడా ఎటాక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 కి విన్నర్ గా కౌశల్ నిలవడం..కప్ గెల్చుకోవడం జరిగింది.
అయితే కౌశల్ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలో బయట ఆయనకు కౌశల్ ఆర్మీ అంటూ ఏర్పడటం..ఓటింగ్ లో తమ ఆదిపత్యాన్ని చూపించుకోవడం జరిగింది. తాజాగా కౌశల్ విజేతగా నిలవడానికి కారణమైన కౌశల్ ఆర్మీ, ఆయనపైనే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాన్ ని కౌశల్ అవమానపరుస్తూ మాట్లాడాడని కౌశల్ ఆర్మీలోని కొందరు సభ్యులు చెప్పడంతో, పవన్ అభిమానులు కౌశల్ పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంపై కౌశల్ స్పందిస్తూ..పవన్ కల్యాణ్ గారు అంటే నాకెంతో అభిమానం .. నా లైఫ్ స్టైల్ పై ఆయన ప్రభావం ఎంతో వుంది.
ఆయన నాకు ఎన్నో అవకాశాలను ఇప్పించారు. నేను పవన్ కల్యాణ్ గారిని కలుసుకోవడానికి ఎంతగా ప్రయత్నించానో ఆయన సిబ్బందికి తెలుసు. అలాంటి నేను ఆయనను ఎందుకు అవమానించేలా మాట్లాడుతానని అన్నారు. కొంత మంది కావాలనే ఆయన అభిమానులను రెచ్చగొట్టడానికి చేస్తోన్న పని అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మహేశ్ బాబు గారు కూడా నాకెంతో హెల్ప్ చేశారు. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణం" అని చెప్పుకొచ్చాడు.