ఇప్పటి వరకు ఇండియన్ మూవీ హిస్టరీలో మణిరత్నం చేసిన చిత్రాలు తక్కువే అయిన అన్నీ ఓ రేంజ్ లోహిట్ కొట్టాయి.  ఆయన తీసే ఏ చిత్రమైనా సరే ఆ కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.  రోజా,ముంబాయి నుంచి మొన్నటి నవాబ్ వరకు విభిన్నమైన చిత్రాలకు తెరపైకి తీసుకు వచ్చారు.  స్టార్ హీరోలు మణిరత్నంతో ఒక్కసారైనా నటించాలని భావిస్తుంటారు. 
Image result for maniratnam
ఇటీవల అరవింద్ స్వామి, శింబు కాంబినేషన్ లో వచ్చిన ‘నవాబ్’సూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రం తమిళంలోనే కాదు తెలుగు లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.  అంతకు ముందు రెండు మూడు చిత్రాలు ఫెయిల్యూర్ అయిన విషయం తెలిసిందే. నవాబ్ హిట్ తో మణి రత్నం ఈజ్ బ్యాక్ అన్నారు. తాజాగా ఆయన ఓ భారీ చారిత్రక చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
Image result for nawab movie
ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన 'పొన్నియన్ సెల్వన్' అనే చారిత్రక నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరపైకి తీసుకురానున్నారు. క్రీ.శ 947లోని మొదటి రాజరాజ చోళుని కథగా ఈ సినిమా రూపొందనుంది. ఇది  తన డ్రీమ్ ప్రాజెక్టుగా మణిరత్నం చెప్పుకుంటున్నారు.  ఈ చిత్రంలో విలక్షణ నటుడు మోహన్ బాబు  ఒక కీలకమైన పాత్ర ఇవ్వాలని, ఆయనను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: