విజయాలు లేకుంటే ఎంతగొప్ప దర్శకులు అయినా సైడ్ ట్రాక్ పడతారు. ఇలాంటి పరిస్థితులలో ‘సరైనోడు’ తరువాత వరస పరాజయాలు చూస్తున్న బోయపాటికి మైత్రి మూవీస్ గతంలో మైత్రి మూవీస్ ఇచ్చిన కోటి పాతిక అడ్వాన్స్  వివాదం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
ఇద్దరికీ హిట్టు అవసరమే..
ప్రస్తుతం బోయపాటితో సినిమా చేసే ఉద్దేశం మైత్రి మూవీస్ కు లేక పోవడంతో మైత్రి మూవీస్ నిర్మాతలు బోయపాటికి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కు ఇవ్వమని అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ విషయంలో బోయపాటి తాను తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చి వేయడానికి అంగీకరించినా ఆ అడ్వాన్స్ కు సంబంధించి మైత్రి మూవీస్ లెక్కలు చెపుతున్న వడ్డీలు చక్ర వడ్డీలు బోయపాటికి అయోమయం సృష్టిస్తున్నట్లు టాక్.
బోయపాటి ఈ నెల్లోనే ప్లాన్ చేశాడు కానీ..
దీనితో మైత్రి మూవీస్ కు ఇవ్వవలసిన మొత్తం మోడు కోట్లుగా తేలడంతో అంత మొత్తం తాను బోయపాటి స్పష్టం చేయడంతో ఈవిషయం  ఫిలిం ఛాంబర్ లోని నిర్మాతల మండలి వరకు వెళ్లినట్లు సమాచారం. దీనితో టెన్షన్ పడుతున్న బోయపాటి బాలకృష్ణ సహాయం కోరితే బాలయ్య రాయబారాలతో బోయపాటి ఎంతో కొంత అదనంగా వెనక్కు ఇచ్చే విధంగా చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
 à°…ప్పటి వరకు వెయింటింగ్ తప్పదు
, గతంలో దర్శకుడు త్రివిక్రమ్ మైత్రి మూవీస్ దగ్గర అడ్వాన్స్ పుచ్చుకుని ఇలా సినిమాను చేయలేనప్పుడు ఇలాంటి చర్చలే జరిగాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనితో దర్శకులు చాలామంది మైత్రి మూవీస్ దగ్గర అడ్వాన్స్ లు పుచ్చుకోవడానికి ప్రస్తుతం భయపడిపోతున్నట్లు టాక్. దర్శకుడుకి విజయం రాగానే అడ్వాన్స్ లు ఇవ్వడం పరాజయాలు రాగానే ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చివేయమని అడగడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక అలవాటుగా మారిన నేపధ్యంలో హీరోలు దర్శకులు కూడ తమకు క్రేజ్ ఉన్నప్పుడు కోట్లలో నిర్మాతల కష్టాలు ఆలోచించకుండా సొమ్ములు వసూలు చేస్తున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: