కోలీవుడ్ లో స్టార్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అక్కడ రజిని, కమల్, విజయ్, అజిత్, సూర్యలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమ హీరో సినిమా రిలీజ్ అంటే చాలు తెగ హడావిడి చేస్తారు. ఏ పరిశ్రమలో అయినా అది ఉండేదే కాని తమ హీరో సినిమా 50వ రోజని థియేటర్ లో హంగామా చేసే ఫ్యాన్స్ తక్కువ ఉంటారు. అలాంటి ఫ్యాన్స్ కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ కు ఉన్నారు.


సంక్రాంతి బరిలో దిగిన అజిత్ విశ్వాసం సినిమా 50 రోజులు పూర్తి చేసుకోగా ఆ సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ను అజిత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. సినిమా 50వ రోజు చెన్నైలోని రోహిణి థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ టికెట్స్ వారం ముందే అమ్మేయడంతో జనాలు బాగా వచ్చారు. సినిమా మొదటిరోజు ఎలా ఉంటారో అంతకుమించి ఫ్యాన్స్ వచ్చారు.     


వచ్చామా సినిమా చూశామా వెళ్లామా అన్నట్టు కాకుండా థియేటర్ ను ధ్వంసం చేయడం.. తెర కూడా చించేయడం లాంటి నానా రచ్చ చేశారట. వెంటనే థియేటర్ ఓనర్ ట్విట్టర్ లో థియేటర్ల బాధ్యతకు హామి ఇచ్చేదాకా థియేటర్ మూతపడుతుందని ట్వీట్ చేశారు. అయితే అజిత్ ఫ్యాన్స్ అని చెప్పుకుని వేరే ఫ్యాన్స్ ఇలా చేసి ఉంటారని కొందరి వాదన.   


విశ్వాసం సంక్రాంతికి వచ్చింది. ఆ రిలీజ్ టైంలో కూడా రజినికాంత్ పేటకు పోటీగా వచ్చింది.. అప్పుడు కూడా రజిని, అజిత్ ఫ్యాన్స్ గొడవ పడిన విషయం తెలిసిందే. అభిమానం ఉండాలి కాని మరి ఇలా శృతిమించితే మాత్రం అభిమానించే స్టార్ హీరోలు కూడా ఇష్టపడరని తెలుసుకోవాలి. మరి విశ్వాసం వల్ల రోహిణి థియేటర్ ధ్వంసం అయ్యింది ఈ విషయంపై ఆ సినిమా హీరో అజిత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: