'కమరకట్టు' అనే చిత్ర దర్శకుడు రాంకీ రామకృష్ణన్.. నర్తకి దర్శకురాలు విజయపద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్ లతో కలిసి 'ఇదయం తిరైయరంగం' అనే సినిమా నిర్మాణం చేపట్టారు. అయితే కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో మోసం చేయడంతో సినీ దర్శకుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి పులల్ జైలుకి తరలించారు.

 'ఇదయం తిరైయరంగం' అనే సినిమా నిర్మాణం కోసం శావుకార్ పేటకు చెందిన అశోక్ అనే ఫైనాన్షియర్ వద్ద అప్పుగా కొంతడబ్బుని తీసుకున్నారు. దానికి బదులుగా ఆస్తుల పట్టాలను కుదవ పెట్టారు. 

అయితే చెప్పిన సమయానికి సదరు వ్యక్తికి రూ.4.60 లక్షలు తిరిగి చెల్లించకపోవడంతో  అశోక్ అనే ఫైనాన్షియర్కోర్టుని ఆశ్రయించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల దర్శకుడు రాంకీ రామకృష్ణన్, విజయ పద్మ, ఆమె భర్త ముత్తుకృష్ణన్ లను బుధవారం నాడు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: