టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా నందమూరి బాలకృష్ణ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు. వాస్తవానికి బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత హీరోగా మారారు. ఇప్పటి వరకు వంద సినిమాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత మూడు సినిమాలు పూర్తి చేశారు. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి తన కెరీర్ పైనే దృష్టి పెట్టిన బాలయ్య ఏనాడూ దర్శకత్వం, నిర్మాణ రంగం వైపు చూడలేదు.
మొదటి సారిగా నిర్మాతగా మారి సొంత బ్యానర్ లో తన తండ్రి బయోపిక్ తో నిర్మాతగా మారాడు బాలకృష్ణ. ప్రముఖ దర్శకులు క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎన్టీఆర్ బయోపిక్’రెండు భాగాలుగా తీశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు. ప్రీరిలీజ్ బిజినెస్ డెబ్బై కోట్ల వరకు జరగంతో సినిమా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుందని అనుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక అన్ని అంచనాలు తారుమారయ్యాయి. లాభాల సంగతి పక్కన పడితే కనీసపు వసూళ్లు లేక బయ్యర్లు బోరుమంటున్నారు.
ఈ క్రమంలో బాలయ్య తన బ్యానర్ పై సినిమాలు చేసే ఆలోచనను పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాల తర్వాత బాలయ్య ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై బోయపాటితో ఓ సినిమా తీయాలని భావించారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బకు ఆ ఆలోచన మానుకున్నట్లు సమాచారం. దాంతో బోయపాటితో తీసే సినిమా కోసం నిర్మాతను వెతికే పనిలో పడ్డారు. మరి బాలయ్య పూర్తిగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటారా లేదా..? అనే విషయంపై అధికార ప్రకటన రావల్సివుంది.