రంగస్థలం తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా సూపర్ స్టార్ మహేష్ తోనే అంటూ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తుండగా ఆ సినిమా పూర్తి కాగానే తర్వాత సుకుమార్ సినిమానే అన్నారు. 


కాని మధ్యలో అనీల్ రావిపుడి మహేష్ కోసం ఓ కథ రెడీ చేయడం ఆ ప్రాజెక్ట్ పైనే మహేష్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్న వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఓకే అయితే మహేష్ సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయినట్టే. ఈ వార్తలు అటు ఇటు వెళ్లి సుకుమార్ దగ్గరకు వెళ్లాయట. మహేష్ తో ఆల్రెడీ కథ ఓకే అయ్యిందని తర్వాత తనదే అని అంటున్నాడు సుకుమార్.


మహేష్ తో సుకుమార్ ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా నిరాశపరచింది. అయితే ఈసారి మాత్రం హిట్ టార్గెట్ తోనే ఈ సినిమా చేస్తున్నారట. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ మీదకు వెళ్తుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్న ఈ సినిమా కథ బాగా వచ్చిందని తెలుస్తుంది.


మహేష్ మహర్షి సినిమా కూడా మరో శ్రీమంతుడు సినిమా తరహాలో ఉంటుందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న మహర్షి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న మహర్షి సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేసేలా చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: