‘సైరా’ మూవీకి సంబంధించిన వ్యవహారాలూ ఏమీ చిరంజీవి సూచనలకు అనుగుణంగా కాకుండా సురేంద్ర రెడ్డి నిర్ణయాలను అనుసరించి వ్యవహారాలు జరుగుతూ ఉండటంతో చిరంజీవి ఈమధ్య సురేంద్ర రెడ్డిని తన వద్దకు పిలిపించుకుని సున్నితంగా క్లాస్ పీకినట్లు సమాచారం. ఈమూవీ ప్రాజెక్ట్ ప్రారంభం అయి సంవత్సర కాలం దాటిపోతున్నా ఈమూవీ ఎప్పటికి పూర్తి అయి ఎప్పుడు విడుదల అవుతుందో చిరంజీవికే తెలియని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.
దీనికితోడు ఈమూవీ షూటింగ్ ను అనుకున్న విధంగా ముందుకు తీసుకు వెళ్ళడంతో సురేంద్ర రెడ్డి అన్నివిధాల విఫలం అయ్యాడు అన్న అభిప్రాయం ప్రస్తుతం చిరంజీవికి ఏర్పడినట్లు టాక్. అదేవిధంగా షూటింగ్ సమయంలో ఏర్పడే సమస్యలకు సురేంద్ర రెడ్డి ఆ సమయంలో పరిష్కారం చేయలేక అనేకసార్లు షూటింగ్ పోస్ట్ పోన్ చేయడం చిరంజీవికి ఏమాత్రం నచ్చడం లేదు అన్న గాసిప్పులు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ పని ఏమాత్రం ముందుకు సాగకపోవడంతో పాటు గ్రాఫిక్స్ వర్క్స్ విషయంలో సురేంద్ర రెడ్డి శ్రద్ధ పెట్టకుండా ఈమూవీ రొటీన్ షూటింగ్ గురించి శ్రద్ద పెడుతూ ఉండటం చిరంజీవిని భయపెడుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈసినిమా బడ్జెట్ 200 కోట్లు దాటిపోవడంతో ఈమూవీ బిజినెస్ ను కొనసాగించాలి అంటే ఈమూవీ రిలీజ్ టైంకు సంబంధించిన క్లారిటీని బయ్యర్లు అడుగుతున్న నేపధ్యంలో ఈ కన్ఫ్యూజన్ చిరంజీవికి తలనొప్పిగా మారింది అని అంటున్నారు.
వాస్తవానికి ఇలాంటి భారీ సినిమాను సురేంద్ర రెడ్డి హ్యాండిల్ చేయలేడు అని చిరంజీవికి సందేహాలు ఉన్నా కేవలం చరణ్ ఒత్తిడి పై సురేంద్ర రెడ్డి ఎంపికకు చిరంజీవి అంగీకారం తెలిపాడు అని అంటారు. దీనితో ప్రస్తుతం సురేంద్ర రెడ్డిని ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పించలేక ఇంకా మిగిలి ఉన్న 30 శాతం మూవీ చిత్రీకరణ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియక టెన్షన్ పడుతున్న చిరంజీవి ఒత్తిడితో సురేంద్ర రెడ్డి తీవ్ర అంతర్మధనంలో ఉన్నాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..