మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష బరిలో శివాజీ రాజాతో పాటు సీనియర్ నటుడు నరేష్ ఉన్నారు. దీంతో ‘మా’లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. న‌రేష్‌, శివాజీరాజా ప్యానెళ్లు అధికారం కోసం పోటీప‌డ‌బోతున్నాయి.

(మా) అధ్యక్ష ఎన్నిక బరిలో సీనియర్ నటుడు నరేష్ నిలుస్తుండగా... జీవితా, రాజశేఖర్‌‌తో పాటు మరికొంతమంది ఈ ప్యానల్ తరఫున పోటీ చేస్తున్నారు.  ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులను కలుస్తున్నారు.  ఈ నేపథ్యంలో నరేష్ అతడి ప్యానల్ సభ్యులు మహేశ్ బాబు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.  మకు మద్దతు ఇవ్వాలని చిరంజీవిని కోరారు.

ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సానుకూలంగా స్పందించినట్లు నరేష్ ట్వీట్ చేశారు. వివాదాలకు దూరంగా ఉండాలని చిరంజీవి సూచించినట్లు నరేష్ తెలిపారు. వివాదాలకు దూరంగా ఉండాలని చిరు చెప్పినట్టు నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను నరేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: