బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు బహుబాషా నటుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల శంకర్, రజినీకాంత్ కాంబో లో వచ్చిన ‘2.0’లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు అక్షయ్ కుమార్. తాజాగా ఆయన నటించిన ‘కేసరి’చిత్రం రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో పవర్ ఫుల్ మాస్, కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేసే దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్షన్లో సూర్యవంశీ అనే చిత్రం చేస్తున్నాడు.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. 020 ఈద్ కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. అంతే కాదు ఈ చిత్రంలో మరో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గతంలో రోహిత్ శెట్టి సింగం సిరీస్, సింబా అనే చిత్రాలు చేశాడు.
ఇప్పుడు పోలీస్ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కాప్ డ్రామా సిరీస్లో నాలుగో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యవంశీ చిత్రాన్ని రోహిత్ శెట్టి - కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబై పోలీసులు జరుపుకునే వార్షిక కల్చరల్ షో ఉమంగ్ వేడుకకు అజయ్ దేవ్ గన్, రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్ తో కలిసి డైరెక్టర్ రోహిత్ శెట్టి హాజరయ్యారు.