ఈ నెల 10న మా అసోసియేష్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీలో ఉన్న శివాజీ, సీనియర్ నరేష్ లో తమ ప్యానెల్ తో సీనియర్ సెలబ్రెటీలను కలిసి ‘మా’అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం మా అధక్షుడిగా ఉన్న శివాజీరాజా పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మొన్న సీనియర్ నరేష్ ప్రిన్స్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట జీవిత, రాజశేఖర్ లు కూడా ఉన్నారు. తాజాగా ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలని మెగాస్టార్ కు శివాజీరాజ,శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
శివాజీరాజాకు పోటీగా నరేష్ ప్యానెల్ సభ్యులు ఇప్పటికే సినీప్రముఖులను కలిసి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. కాగా, ఈరోజు మెగాస్టార్ ను శివాజీరాజా ప్యానెల్ కలుసుకున్న విషయాన్ని ప్రముఖ నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.