బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఇండ్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోగా మంచి ఫామ్ లోకి వచ్చిన తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూతురు ట్వింకిల్ ఖన్నాని వివాహం చేసుకున్నారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ మద్య మేకర్స్ చేసే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రేక్షకులకి కొత్తగానే కాదు వింతగాను అనిపిస్తున్నాయి. అవి మూవీస్ కావొచ్చు..వేరే ఏ ప్రొగ్రామ్ కావొచ్చు..ప్రమోషన్లతో ఊదరగొడుతున్నారు.
తాజాగా అక్షయ్ కుమార్ తన వెబ్ సిరీస్ కోసం మంటలలో కాలుతూ స్టేజ్పైకి వచ్చి ఆహుతులని అలరించాడు. అక్షయ్ కుమార్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వాళ్ళతో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమం ప్రమోషన్ కోసం ఇలా మంటలలో కాలుతూ స్టేజ్ పైకి వచ్చాడు. మంటల్లో కాలుతూ వస్తున్న అక్షయ్ కుమార్ చూసి ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ప్రస్తుతం ఆయనకి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, అక్షయ్ చేయబోతున్న వెబ్ సిరీస్ టైటిల్ ది ఎండ్ ( వర్కింగ్ టైటిల్). ఇది కేవలం ఆరంభమే అంటూ అక్షయ్ తన ట్వీట్లో తెలిపాడు. ఇటీవల పుల్వామ దాడిలో వీర జవాన్లకు ఐదు కోట్లు విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం కేసరి, సూర్యవంశి చిత్రాల్లో నటిస్తున్నాడు అక్షయ్.