టాలీవుడ్లో ఎపుడేం జరుగుతాయో తెలియదు. చెప్పిన కాంబినేషన్లు హటాత్తుగా మారిపోతాయి. అలాగే కాస్టింగ్  క్రూ మొత్తం మారుతుంది. వీటి వెనక సెంటిమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. లక్కు ఇక్కడ కిక్కు ఇస్తుంది. దాని కోసం సినీ లోకం పరుగులు తీస్తుంది.  ఇక్కడ ఎవరితోనైనా తేడా వస్తే చాలు హాయ్.. బై లు  కూడా ఉండవంటే ఉండవ్.


ఇక విషయానికి వస్తే సెంటిమెంట్ ని తెగ నమ్మిన సినిమా హీరో బాలక్రిష్ణ. ఆయన ఒక హీరోయిన్ తో హిట్ కొడితే ఆమెనే తరువాత కంటిన్యూ చేస్తాడు. డైరెక్టర్ తోనూ అలాగే ఉంటాడు. ఇక ఆయన జాతకాలను బాగా నమ్ముతారు. ఇపుడు అలాంటిదే ఆయనొకటి చేస్తున్నారు. తాను నిర్మాతగా ఎంబీకే పతాకంపై ముచ్చటగా మూడవ చిత్రం అంటూ కధానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రకటన చేశారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న మూవీకి  నిర్మాతగా బాలయ్యే ఉంటాడని అలా ప్రకటించారు. ఇకపై  తనతో ఎవరు  సినిమా తీసినా తానే నిర్మాతగా ఉంటానని కూడా బాలయ్య అనుకున్నారు.


అయితే కధానాయకుడు,  మహానాయకుడు చిత్రాలు డిజాస్టర్లు కావడంతో బాలయ్య ఇపుడు మనసు మార్చుకున్నారట. ఇకపైన తాను నిర్మాతగా సినిమాలు చేయరాదని గట్టిగా డిసైడ్ అయ్యారట. దాంతో బాలయ్య, బోయపాటి మూవీకి నిర్మాతగా సీ కళ్యాణ్ అంటున్నారు. ఆయన బాలయ్యతో జై సిహ్మా మూవీ తీసి హిట్ కొట్టారు. పైగా బాలయ్యతో ఆయన మూవీ కమిట్మెంట్ కూడా ఒకటి ఉంది. వీవీ వినాయక్ డైరెక్షన్లో బాలయ్యతో మూవీ తీయాలనుకున్న సీ కళ్యాణ్  కి  హ్యాట్రిక్ కాంబో మూవీ బాలయ్య అప్పగించాడు. మరి సీ కళ్యాణ్ ఇపుడు బాలయ్య పాత్రలోకి వచ్చాడన్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: