‘గీత గోవిందం’ సక్సస్ తో విపరీతమైన లాభాలు గణించిన అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర్జున్ వరుణ్ తేజ్ అల్లు శిరీష్ సాయి ధరమ్ తేజ్ లతో వరసపెట్టి సినిమాలు చేస్తూ తిరిగి తన గీత ఆర్ట్స్ కు పూర్వ వైభవం తీసుకు రావాలని ఆలోచనలు చేసాడు. ఇందుకోసం అరవింద్ చాలామంది డైరెక్టర్స్ కు అడ్వాన్స్ లు ఇచ్చి ఎగ్రిమెంట్ లు కూడ చేసుకున్నాడు.
ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ వ్యవహరి శైలి వల్ల అరవింద్ తాను ఇచ్చిన మాట పోకోట్టుకోవలసి వస్తోంది అని బాధ పడుతున్నట్లు టాక్. ‘గీత గోవిందం’ తరువాత పరుశురామ్ ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి రవితేజాతో ఒక సినిమా చేయడానికి అంతా సెట్ చేసుకున్నాడు. అయితే అరవింద్ ఈవిషయానికి అడ్డు పడుతూ అల్లు అర్జున్ తో తన గీత ఆర్ట్స్ కోసం సినిమా తీయమని పరుశురామ్ ను ప్రోత్సహించి రవితేజా మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యేలా చేసాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీనితో పరుశురామ్ త్రివిక్రమ్ బన్నీల సినిమా తరువాత తన సినిమా ఉంటుందని ఆశించి గీత ఆర్ట్స్ కే అతుక్కుపోయాడని అంటారు. అయితే ఇప్పుడు అనుకోకుండా అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీ ప్రకటింపబడటం ఆతరువాత మురగదాస్ తో బన్నీ మరో సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు అని వార్తలు రావడంతో ఖంగారు పడ్డ పరుశురామ్ అరవింద్ ను కలిసి బన్నీతో తన సినిమా ఎప్పుడు అని అడిగినట్లు సమాచారం.
దీనితో అరవింద్ అసలు విషయం నెమ్మదిగా బయటపెడుతూ బన్నీతో సినిమా ఆలస్యం అవుతుంది కాబట్టి సమయం వృధా కాకుండా నాగచైతన్యతో కానీ అఖిల్ తో కానీ గీత ఆర్ట్స్ తరఫున సినిమా చేయమని సూచించినట్లు తెలుస్తోంది. ఈమాటలతో షాక్ అయిన పరుశురామ్ తాను చిన్న హీరోలతో సినిమాను చేయనని పెద్దహీరోలతో సినిమా చేస్తానని అంటూ తనకు అరవింద్ ఇచ్చిన మాటను నిలుపుకోవలసిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో అల్లు అర్జున్ స్పీడ్ తాను ఇచ్చిన మాటకు విలువలేకుండా చేస్తోంది అంటూ అరవింద్ అంతర్మధనంలో ఉన్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..