రంగ స్థలం వంటి భారీ హిట్ తరువాత సుకుమార్ ప్రాజెక్ట్ మహేష్ తో రద్దు అవ్వటం తో ఇండస్ట్రీ లో ఈ న్యూస్ బాగా హల్ చల్ చేసింది. అయితే తరువాత సుకుమార్ .. అల్లుఅర్జున్ తో సినిమా అనౌన్స్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన న్యూస్ బయటికి వచ్చింది. మహేష్ బాబు నుంచి బన్నీ దగ్గరకు దర్శకుడు సుకుమార్ షిప్ట్ కావడానికి మధ్యలో ఎన్టీఆర్ దగ్గర కూడా ఓ హాల్ట్ వేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సకుమార్ సతమతం...

తారక్ సినిమా ఒకటి తనతో వుంటుందని ప్రకటించాలని సుకుమార్ కోరినట్లు తెలుస్తోంది. మహేష్ తో తన సినిమా వుండదని మీడియా వస్తున్న కథనాల నేపథ్యంలో తనకు ప్రాజెక్టులకు కొదవలేదు అన్న విషయం జనాలకు తెలియాలని, అలాగే వీలైతే డేట్ లు ఇస్తే, ఓ సినిమా చేద్దామని సుకుమార్ కోరినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే రాజమౌళి సినిమా అయ్యేదాకా మరో సినిమా గురించి మాట్లాడడం, ఆలోచించడం కుదరదని ఎన్టీఆర్ చెప్పినట్లు, ఈ విషయంలో కొంత డిస్కషన్ జరిగినా, ఎన్టీఆర్ అదేమాటపై వుండిపోయినట్లు తెలుస్తోంది.

సుకుమార్ చెప్పిన లైనుకు బన్నీ సంతృప్తి

ఈ విషయంలో ఎన్టీఆర్ ఏమాత్రం అనుకూలంగా మాట్లాడలేదని తెలుస్తోంది. అప్పుడు సుకుమార్ గీతాక్యాంప్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. గీతాక్యాంప్ లో బన్నీవాస్, బన్నీ అందరూ సుక్కూకు మంచి మిత్రులు. తనకోసం ఈ సాయం చేయాల్సిందే అని అడగడంతో, సినిమాను అనౌన్స్ చేయడానికి బన్నీ ముందుకు వచ్చాడు. ఆ విధంగా సుకుమార్ పయనం మహేష్ నుంచి ఎన్టీఆర్ మీదుగా బన్నీ దగ్గరకు చేరిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: