ఎట్టకేల‌కు మ‌రుగున ప‌డ్డ కృష్ణవంశీ పేరు మ‌ళ్ళీ తెర‌పై సంద‌డి చేయ‌టానికి మొద‌లైంది. 2002లో వ‌చ్చిన ఖ‌డ్గం మూవీ త‌రువాత కృష్ణవంశీ తీసిన మూవీల్లో కేవ‌లం అతి కొద్ది మూవీలే బాక్సీపీస్ వ‌ద్ద చెప్పుకోద‌గ్గ మినిమం క‌లెక్షన్స్‌ను వ‌సూల్ చేసింది. 2005లో చ‌క్రం మూవీ, 2007లో చంద‌మామ‌, 2009లో మ‌హాత్మా ఇలా రెండు సంవ‌త్సరాల‌కొక‌సారి మాత్రమే కృష్ణవంశీ త‌న మూస స్టోరీల‌కు రంగులు అద్ది రిలీజ్‌ చేస్తున్నాడు. ఇక నుండి ఇటువంటి స్లో జ‌ర్నీలకు చెక్ చెప్పి, మూవీల స్పీడ్‌ను పెంచుకునేందుకు క్రియోటివ్ డైరెక్టర్ ప్లాన్స్ వేస్తున్నాడు. మ‌ల్టీస్టార‌ర్‌ త్రయం మూవీ షూటింగ్‌ను త్వర‌లో సెట్స్‌పైకి తీసుకువెళ్ళటానికి రెడీ అవుతున్నాడు.

అంతేకాకుండా నాని న‌టించిన పైసా మూవీ ఆడియో ఫంక్షన్ జరిగి చాలా రోజులు అయినా, ఇంత వ‌ర‌కూ ఆ మూవీ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కటి కూడ లేదు. త్రయం మూవీలో బిజి అయ్యే ముందే పైసా మూవీ ఫైన‌ల్ అవుట్‌ను రెడీ చెయ్యాల‌ని దానికి సంబంధించిన మిక్సింగ్ ప‌నుల‌ను ప్రారంభించాడు. పైసా మూవీ మిక్సింగ్ ప‌నులు స్టార్ట్ కావ‌డంతో, అన్ని అనుకూలిస్తే ఈ మూవీను అక్టోబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ చేయాల‌ని అనుకుంటున్నారు. మొత్తంగా పైసా మూవీ రిలీజ్ త‌రువాత కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న మ‌రో మ‌ల్టీస్టార‌ర్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఆ త‌రువాతో మ‌రో పెద్ద హీరోతో కృష్ణవంశీ మూవీ ఉంటుందని టాలీవుడ్ స‌మాచారం. ఈ ర‌కంగా కృష్ణవంశీకు శుభ‌గ‌డియ‌లు మొద‌ల‌య్యాయంటున్నారు అంద‌రూ.

మరింత సమాచారం తెలుసుకోండి: