జబర్ధస్త్ తో ఫామ్ లోకి వచ్చిన యాంకర్ అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో వెండి తెరపై కనువిందు చేసింది. అక్కినేని నాగార్జున సరసన నటించినా అనసూయకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత క్షణం సినిమాలో నటించింది..ఆ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. గత యేడాది సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా నటించిన అనసూయకు ఒక్కసారే క్రేజ్ పెరిగిపోయింది.
ఈ సినిమాలో డి గ్లామర్ గా నటించి అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రధారిగా 'కథనం' సినిమా రూపొందింది. తాజాగా ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనసూయ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ‘మహిళా దినొత్సవం’ సందర్బంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చెయనున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ... కథ నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చెస్తున్నాము. అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఈ మూవీతో అనసూయకు మరింత పేరు వస్తుందని ఆయన అన్నారు.
ఈ మూవీలో అనసూయ, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీ, సమీర్, ముఖ్తార్ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి ప్రొడక్షన్ కంట్రోలర్ః బాలాజీ శ్రీను, ఎడిటర్ఃఎస్.బి. ఉద్దవ్, మ్యూజిక్ః సునీల్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ః కె.వి.రమణ, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీః సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యుసర్ : ఎమ్.విజయ చౌదరి, నిర్మాతలుః బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా, కథ, స్క్రీన్ప్లే,దర్శకత్వంఃరాజేష్ నాదెండ్ల,