సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా అదో పెద్ద సంచలనమే. ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్న వర్మ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో చూపించని ఎన్.టి.ఆర్ జీవిత అసలు కథ చెబుతా అంటున్నాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ టైటిల్ పెట్టిన నాటి నుండి సినిమా సంచలనంగా మారింది.


ఇక వర్మ మార్క్ పోస్టర్స్ తో ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఇప్పుడు రిలీజ్ కు దగ్గర పడుతున్న ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో మరింత చర్చ జరిగేలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడట. దీనికి ఓ ముగ్గురు స్పెషల్ గెస్టులను పిలుస్తున్నారని తెలుస్తుంది. వారెవరో తెలుసా.. శ్రీరెడ్డి, కత్తి మహేష్, టివి 5 మూర్తి.


ఈ ముగ్గురు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. టివి ఆన్ చేసినా.. సోషల్ మీడియాలో కూడా వీరి సందడి మాములుగా ఉండదు. టివి 5 మూర్తి తాను ఎలాంటి విషయాన్నైనా కుండబద్ధలు కొట్టినట్టు విత్ ప్రూఫ్స్ అవతల ఎవరైనా రచ్చ చేస్తాడు. ఇక బిగ్ బాస్ నుండి వచ్చాక కత్తి మహేష్ చేసిన హంగామా తెలిసిందే.


శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ అని యుద్ధం మొదలుపెట్టి మెగా ఫ్యామిలీ మీద, దగ్గుబాటి ఫ్యామిలీ మీద తన విమర్శనాస్త్రాలు చేస్తుంది. ఈ ముగ్గురు సంచలన వ్యక్తులు ఇప్పుడు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కోసం ప్రమోట్ చేస్తారట. అయితే ఇక్కడ ఓ కామన్ పాయింట్ ఏంటంటే ముగ్గురు పవన్ వ్యతిరేకులే కావడం విశేషం. మరి ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: