‘సైరా’ కు సంబంధించిన షూటింగ్ ఇంకా సుమారు 30 శాతం వరకు పెండింగ్ ఉందని అంటున్నారు. దీనితో ఈసినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తి అవుతుందో చిరంజీవికే తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో ఇంకా కనీసం షూటింగ్ కూడ పూర్తికాని ఈమూవీ ప్రమోషన్ కోసం చరణ్ చిరంజీవితో ఒక ఇంటర్వ్యూను రికార్డ్ చేసి ఆ ఇంటర్వ్యూను త్వరలో ఒక ఛానల్ లో ప్రసారం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
SyeRaa Narasimha Reddy teaser clocks 5 million views
ఇలా చరణ్ చిరంజీవితో ఒక ఇంటర్వ్యూను ప్లాన్ చేయడానికి వెనుక ఒక కారణం ఉంది అంటున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ‘సైరా’ మూవీకి సంబంధించి శాటిలైట్ రైట్స్ ను అత్యంత భారీ మొత్తానికి అమ్మాలని చరణ్ భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ‘సైరా’ శాటిలైట్ రైట్స్ కోసం చాల ప్రముఖ ఛానల్స్ ఆసక్తి కనపరుస్తూ ఉన్నా చరణ్ చెపుతున్న రేట్లకు భయపడి వెనకడుగు వేస్తున్నట్లు టాక్. 
Chiranjeevi in Sye Raa Narasimha Reddy
దీనికితోడు ఈమధ్య గత కొంత కాలంగా విడుదల అవుతున్న చాల భారీ సినిమాలు ఘోరపరాజయం చెందిన నేపధ్యంలో ఆమూవీ శాటిలైట్ రైట్స్ ను అత్యంత భారీ మొత్తాలకు మోజుపడి కొనుకున్న ఛానల్స్ కు వారు ఊహించని విధంగా ఆసినిమాలు ప్రసారం అయ్యే సమయంలో వచ్చే యాడ్స్ ఆదాయం బాగా తగ్గిపోవడంతో ‘సైరా’ విషయంలో చాల ఛానల్స్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ‘సైరా’ మార్కెట్ కోసం ఈ ఇంటర్వ్యూను చరణ్ ప్లాన్ చేయడమే కాకుండా చిరంజీవిని స్వయంగా చరణ్ ఇంటర్వ్యూ చేస్తాడని తెలుస్తోంది. 
Chiranjeevi's Birthday Gift To You - Motion Poster Of Sye Raa Narasimha Reddy
ఈ ఇంటర్వ్యూలో ‘సైరా’ మేకింగ్ విషయాలు బడ్జెట్ విషయాలు స్టోరీ లైన్ ఇలా అన్ని విషయాలు అందరికీ తెలిసేలా చేసి ‘సైరా’ మార్కెట్ ను పెంచుకోవడం ఇందులోని ఉద్దేశ్యం అని అంటున్నారు. అయితే ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని సినిమాకు అప్పుడే ఇలా ప్రమోషన్ మొదలు పెడితే ఈ ఇంటర్వ్యూలు వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందని మరికొందరు భావిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: