తెలుగు ఇండస్ట్రీలో వరుసగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్ మొదలు ఇప్పటి వరకు ఎదో ఒక ప్రమోషన్ చేస్తూ ఆడియన్స్ ని ఆకర్షిస్తూ వస్తున్నారు.  ఇప్పటి వరకు ఫోటోలు, లిరికల్ వీడియో సాంగ్స్, టీజర్ తో ఆకట్టుకున్న రాంగోపాల్ వర్మ ఈసారి  'లక్ష్మీస్ ఎన్టీఆర్' థియేటరికల్ ట్రయిలర్ ఈ ఉదయం రిలీజ్ చేశారు. మొదటి నుంచి ట్రైలర్ చూస్తే ఎంతటి వారైనా ఢంగైపోవాలి అంటూ రాంగోపాల్ వర్మ అంటూ వస్తున్న విషయం తెలిసిందే. 
Image result for laxmis ntr
నిజంగా ఈ ట్రైలర్ చూస్తే ఆనాడు జరిగిన వాస్తవిక దృష్యాలు మన కళ్లముందు చూపిస్తున్నాడా..ఇందులో ఎంత వరకు నిజం ఉందీ..అన్న ఆలోచనలు రేకెత్తుతున్నాయి.   'వాడూ, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు' అన్న ట్యాగ్ లైన్ తో ప్రారంభమైన ఈ ట్రయిలర్ లో, ఎన్టీఆర్ జీవిత చరమాంకంలోని పలు ఘట్టాలను చూపించే ప్రయత్నం చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే..ను... నేను కాను... నేను... నా ప్రజలు. నా ప్రజలే నన్నింతటి వాడిని చేశారు. ఇప్పుడు వాళ్లే నన్ను వద్దు అనుకుని ఆ పవర్ ని వెనక్కి తీసుకున్నారు" అన్న ఎన్టీఆర్ డైలాగ్ తో ట్రయిలర్ ప్రారంభమవుతుంది.
Image result for laxmis ntr
ఆ తర్వాత చంద్రబాబు పాత్ర దారి మరో డైలాగ్.."మీరనుకున్నట్టు ఆవిడ అంత మంచి మనిషి కాదు... ఇంతకుముందే ఆవిడకు చాలామందితో అఫైర్స్ ఉన్నాయని...అంటూ వస్తుంది.  శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి మహామహా అందగత్తెలతో పరిచయమున్న ఆయనకి... దానిలో ఏముందనో..." అంటున్న ఎన్టీఆర్ కుమార్తె డైలాగ్... నా కొడుకు లోకేశ్ మీద ఒట్టేసి చెబుతున్నాను. దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నంలో నాకు హండ్రెడ్ పర్సంట్ సపోర్ట్ కావాలి మరో డైలాగ్.. 'వెన్నుపోటు పొడిచారు... కుట్ర' అన్న పాట ప్రోమో, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలున్నాయి.  మొత్తానికి ఈ థియేటరికల్ ట్రయిలర్ చూస్తే మరో ట్రెండ్ సృష్టిందా అన్నట్లుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: