టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పది సంవత్సరాల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’సినిమాలో నటించారు. ఈ సినిమాకు వివివినాయక్ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాత. ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించారు చిరంజీవి. ఒక పాత్రలో అల్లరి చేస్తూ మంచి ఎంట్రటైన్ మెంట్ ఇవ్వగా.. రైతుల కోసం పోరాడే యువకుడిగా మరోపాత్రలో చిరంజీవి నటనకు తెలుగు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత సురేందర్ దర్శకత్వంలో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘సైరా నరసింహారెడ్డి ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షరవేగంగా సాగుతుంది.
ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో సినిమాకు ఓకే చేశారు. మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ వరుస విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా ఫలిమ్ నగర్ లో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో అందాల తార శృతిహాసన్ నటించనున్నట్లు తెలుస్తుంది.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే శృతి హాసన్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ సరసన నటించిన విషయం తెలిసిందే. గతంలో కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’సినిమాలో శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అఫిషియల్ ప్రకటన మాత్రం రాలేదు..కేవలం ప్రచారం మాత్రమే జరుగుతుంది.