జబర్ధస్త్ తో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం పలు ఛానల్స్ లో బిజీగా ఉన్న అనసూయ వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. గతంలో అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయన’,‘క్షణం’సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. గత సంవత్సరం సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’సినిమాలో రంగమ్మత్తగా మంచి పేరు సంపాదించింది. దాంతో అనసూయ కు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.
ఓ వైపు బుల్లితెరపై పలు టివి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు వెండితెరపై నటిస్తుంది. తాజాగా అనసూయ ప్రధాన ప్రధాన పాత్రలో 'కథనం' సినిమా రూపొందుతోంది. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ‘మహిళా దినోత్సవం’సందర్భంగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా టీజర్ చూస్తుంటే..అనసూయ హ్యాట్రిక్ కొట్టబోతోందని అనిపిస్తుంది.
ఇక టీజర్ లో దన్ రాజ్..అనసూయతో మీరు సినిమాలో రాసిన స్క్రిప్ట్ ప్రకారం హత్య జరిగింది..అంటాడు. ఇదే విషయం అనసూయ కూడా ప్రస్తావిస్తూ..మీరు నమ్మినా నమ్మక పోయినా నేను రాశాను..రాసిందే జరిగింది..అంటూ డైలాగ్ వస్తుంది. ది మంత్ర ఎంటర్టైన్మైంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాతలు.ఈ వేసవి సెలవుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు.