బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం "సాహో" బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా  స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహో ను కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రభాస్‌ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ₹150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
Related image
ప్రస్తుతం చిత్రీకరణ పూర్తిచేసుకునే దశలో ఉన్నఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో ఓవర్‌ సీస్‌ హక్కులు భారీ మొత్తాని కి దుబాయికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్ ‌ఫిల్స్మ్‌ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా కాకుండా మిగతా హక్కులిఉ కొనగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా ఓవర్‌ సీస్‌ హక్కులు దాదాపు 42 కోట్లకు అమ్ముడైనట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
Image result for happybirthday Sraddha kapoor with sahoo
అయితే ఈవార్తలపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ‘సాహో’ ఓవర్సీస్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని మాత్రమే తెలుస్తోంది. చైనా మినహామిగతా
దేశాల హక్కులను ఫార్ ఫిల్మ్స్ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ మూవీ హిందీ హక్కులను టీ సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్ ₹120 కోట్లకు సొంతం చేసుకున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
Image result for sahoo images
‘బాహుబలి’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అభిమానులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దు తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్‌ నిపుణుల పర్యవేక్షణలో యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: