సినిమా ప్రకటన నుంచే సంచలనం సృష్టిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఈ సినిమా ట్రైలర్ , ఫస్ట్ లుక్, పాటలు అన్నీ సంచలనమే.. ఇప్పుడు ఈ సినిమా వేడుకలోనూ రామ్ గోపాల్ వర్మ మరో షాక్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ నుంచి ప్రారంభం నుంచి బాలయ్యను ఏదో విధంగా కెలుకుతున్న వర్మ.. తాజాగా.. ఈ సినిమాను బాలయ్యకే అంకింతం చేస్తున్నానంటూ షాక్ ఇచ్చాడు.

 


ఈ సినిమా తీయడానికి తనకు స్ఫూర్తినిచ్చింది బాలయ్యే అని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నాడు. లక్మీస్ ఎన్.టి.ఆర్.బయోపిక్ ద్వారా నిజాన్ని కనుక్కొనే ప్రయత్నం చేశానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒక బయోపిక్‌ తీయడానికి కావల్సింది నిజాయతీ. ఆ నిజాయతీతోనే ఈ సినిమా చేశానంటున్నారు వర్మ.


ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిల బంధం నాలుగైదేళ్లు సాగి ఉంటే ఆ సంఘటనలన్నింటినీ రెండున్నర గంటల్లో చెప్పడానికి సాధ్యం కాదు. కానీ ఇందులో ఆ కాలం మొత్తం సారాన్ని, ఆత్మని ఇందులో చూడొచ్చని ఆయన అన్నారు. గీత రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ రామ్‌గోపాల్‌ వర్మ ఈ సినిమా స్క్రిప్టు దశ నుంచి ఆయన ఎంతో తీవ్రంగా కష్టపడి పనిచేశామని ఆయన చెప్పారు.



ఓవైపు బాలయ్య నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులూ ఘోరంగా పరాజయం పాలయ్యాయి. బాలయ్య నష్టాల్లో కూరుకుపోయారు. ఇలాంటి సమయంలో ఈ వర్మ ప్రకటన పుండు మీద కారం జల్లినట్టే ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 22 న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎలా ఉంటుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: