సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు సంబంధించి అదేవిధంగా అతడి వ్యాపార వ్యవహారాలకు సంబంధించి నమ్రత తీసుకుంటున్న నిర్ణయాలు మహేష్ కెరియర్ ను కీలకంగా ప్రభావితం చేస్తున్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్. సుకుమార్ మహేష్ ల మూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడం మహేష్ అనీల్ రావిపూడిల ప్రాజెక్ట్ ముందుకు రావడం వెనుక నమ్రత సలహాలు కీలకంగా ప్రభావితం చేసాయి అన్న కామెంట్స్ ఉన్నాయి.
మహేష్ బాబు సొంత బేనర్లోనే...
ఇలాంటి పరిస్థుతులలో నమ్రతకు ఇప్పుడు ఒక సమస్య వేధిస్తున్నట్లు టాక్. ప్రభాస్ ఇప్పటికే ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ అయినట్లుగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ చరణ్ లు నేషనల్ సెలెబ్రెటీలుగా మారబోతున్న విషయం తెలిసిందే. దీనితో ఈ హీరోలు అందరికంటే సీనియర్ అయినప్పటికీ మహేష్ కు ఇప్పటికీ నేషనల్ సెలెబ్రెటీ స్థాయిని ఇవ్వగలిగిన ఒక్క సినిమా కూడ అతడికి రాకపోవడం నమ్రతకు లోటుగా అనిపిస్తున్నట్లు టాక్. 
మహేష్ బాబు
దీనితో మహేష్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నా అతడి ఇమేజ్ కేవలం దక్షిణాదికి మాత్రమే పరిమితం అవుతోంది. వాస్తవానికి మహేష్ సినిమాలకు కోలీవుడ్ మాలీవుడ్ లలో కూడ చెప్పుకోతగ్గ మార్కెట్ తో పాటు క్రేజ్ కూడ లేదు. ఇలాంటి పరిస్థుతులలో మహేష్ కు నేషనల్ స్టార్ ఇమేజ్ ఇవ్వగల దర్శకుల గురించి జరుగుతున్న అన్వేషణలో నమ్రతకు అనుకోకుండా ఈమధ్య ఒక సమాధానం దొరికినట్లు టాక్. 

తెలుస్తున్న సమాచారం మేరకు సంచలనాలు క్రియేట్ చేసిన ‘కేజీ ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈమధ్య నమ్రతను కలిసి ఒక వెరైటీ కథను చెప్పినట్లు సమాచారం. ఈకథ లైన్ తనకు బాగా నచ్చిందని ఈ కథలోని పాత్ర మహేష్ కు బాగా సరిపోతుందనీ నమ్రత అభిప్రాయపడుతూ ఆమూవీని తమ సొంత నిర్మాణ సంస్థ పై నిర్మిస్తామని ప్రశాంత్ నీల్ కు మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాస్తవానికి ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘కేజీ ఎఫ్ 2’ తీసే ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉన్న నేపధ్యంలో మహేష్ తో తీయబోయే మూవీకి సమయం ఎక్కడ ఉందని ఇది అంతా మహేష్ ను నేషనల్ స్టార్ గా గుర్తింపు తీసుకు రావడానికి మహేష్ పీ ఆర్ టీమ్ నమ్రత సలహా సూచనలతో నడుస్తున్న వ్యూహాత్మక గేమ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: