మహేష్ సుకుమార్ ల మూవీ ప్రాజెక్ట్ అధికారికంగా రద్దు కావడంతో ఇక ఇప్పట్లో మళ్ళీ మహేష్ సుకుమార్ లు కలిసే సందర్భాలు లేవు అంటూ చాలామంది ఊహాగానాలు చేసారు. అయితే ఆ ఊహాగానాలకు బ్రేక్ పడుతూ సుకుమార్ నిన్న సాయంత్రం మహేష్ ఇంటికి వెళ్ళి సుమారు గంటసేపు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. 
Mahesh Babu and Sukumar
క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సుకుమార్ మహేష్ ల మూవీ క్యాన్సిల్ అయిన నేపధ్యంలో నిన్న జరిగిన వీరిద్దరి ఏకాంత సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కోసం మైత్రీ మూవీస్ నిర్మాతలలో ఒకరైన నవీన్ యామినేని అమెరికా నుండి ప్రత్యేకంగా వచ్చి మహేష్ సుకుమార్ ల భేదాబిప్రాయాలు తొలిగించడానికి వీరిద్దరి మధ్య ఈ ఏకాంత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

మైత్రీ మూవీస్ సంస్థకు మహేష్ తో ఉన్న సాన్నిహిత్యంరీత్యా చిన్నచిన్న భేదాబిప్రాయాలు వల్ల మహేష్ తో తమకున్న బంధం తెగిపోకూడదు అన్న ఉద్దేశ్యంతో నవీన్ యామినేని ఈ మీటింగ్ కు చొరవ తీసుకున్నట్లు టాక్. దీనితో సుకుమార్ మహేష్ లు ఈ సమావేశంలో ఏమి మాట్లాడుకున్నారు అన్న విషయమై ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే మహేష్ సుకుమార్ తో తాను మరో ప్రాజెక్ట్ చేస్తాను అని సంకేతాలు ఇచ్చి ఈ సమావేశాన్ని ముగించినట్లు టాక్. 
Sukumar-Mahesh film to go on floors in June
దీనితో సుకుమార్ తిరిగి మహేష్ కోసం మరో మంచి కథ వెతికే పనిలో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది అంతా కేవలం మైత్రీ మూవీస్ నిర్మాతల పట్ల మహేష్ కు ఉన్న మొహమాటం రీత్యా ఏర్పాటు చేయబడిన సమావేశం అనుకోవాలా లేదంటే తిరిగి రానున్న రోజులలో వీరిద్దరి దగ్గర నుండి ఒక మూవీ వస్తుంది అన్న సంకేతాలు అనుకోవాలా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: