మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తయారవుతున్న ‘మహర్షి’ మూవీకి మరో కొత్త సమస్య ఎదురు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈమూవీ చివరకు తన రిలీజ్ డేట్ ను మే 9కి ఫిక్స్ చేసుకున్నా ఈమూవీకి ఇప్పుడు నిడివి రూపంలో మరో పెను సమస్య వచ్చిపడినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ నిడివి నాలుగు గంటలు వచ్చిందని టాక్. వంశీ పైడిపల్లి మూవీకి సంబంధించి రకరకాల క్రియేటివ్ ఆలోచనలు చేస్తూ ఈమూవీని చిత్రీకరించడంతో చివరకు ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఈమూవీ నిడివి నాలుగు గంటలు వచ్చింది అని తెలుసుకుని దర్శకుడు వంశీ పైడిపల్లి కూడ షాక్ అయినట్లు టాక్. 
Mahesh Babu,Maharshi,Vamshi Paidipally
అయితే ఈ విషయాలు తెలుసుకున్న మహేష్ ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీ నిడివి 2గంటల 30నిముషాలు మించకుండా ఎక్కడా ప్రేక్షకులకు బోర్ అనే ఫీలింగ్ లేకుండా ఎడిట్ చేయమని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీ కథ చాల పెద్దది కావడంతో ఎంత కష్టపడినా ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఈమూవీ నిడివి మూడు గంటలకు తగ్గడం లేదు అని అంటున్నారు. 
(L-R) Mahesh Babu, Vamsi Paidipally and Karthi
ఇంకా ఈ నిడివి తగ్గిస్తే సీన్స్ మధ్య కనెక్ట్ టీవిటి కోల్పోయి అసలకు మోసం వస్తుందనీ వంశీ పైడిపల్లి టెన్షన్ అని అంటున్నారు. అయితే మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ‘మహానటి’ అర్జున్ రెడ్డి’ సినిమాలు ఘన విజయం సాధించడంతో అదే సెంటిమెంట్ ను ధైర్యంగా చేసుకుని ‘మహర్షి’ ని మూడు గంటల సినిమాగా మారుస్తానని వంశీ పైడిపల్లి మహేష్ కు ధైర్యం చెపుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: