కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మద్య తీసిన 2.0 మంచి విజయం సాధించింది. ఒకప్పుడు రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ కి సరైన హిట్ లేకుండా పోయింది. అటు శంకర్ సైతం విక్రమ్ తో తీసిన ‘ఐ’సినిమాతో బాగానే దెబ్బతిన్నాడు. చాలా కాలం తర్వాత శంకర్, రజినీ కాంబోలో వచ్చిన 2.0 భారీ అంచనాలుతో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు బడ్జెట్ సుమారు రూ.400 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి రావడం..పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే 2.0 గత మూడేళ్ల క్రితం నుంచి షూటింగ్ మొదలైనా..ఎన్నో అవాంతరాల మద్య గత యేడాది రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం శంకర్, విశ్వనటులు కమల్ హాసన్ కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’సినిమా రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ మొదలు ఇప్పటి వరకు ఎన్నో కాంట్రవర్సీ వార్తలు వస్తున్నాయి. తొలి షెడ్యూల్ సమయంలోనే షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. దర్శక నిర్మాతల మధ్య బడ్జెట్ కారణంగా వచ్చిన మనస్పర్థలే కారణమని అంతా చెప్పుకున్నారు.
దాంతో అసలు నిర్మాతనే మార్చి కొత్త నిర్మాతలో మొదలు పెట్టాలని చూసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అలాంటిదేమీ లేదని హీరో కమల్, దర్శకుడు శంకర్ అన్నారు. టీమ్ మళ్లీ షూటింగును మొదలెట్టేసింది. తొలి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత, తదుపరి షెడ్యూల్ షూటింగును నిలిపేశారనే టాక్ కోలీవుడ్లో షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలపై శంకర్ అసహనం తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
మొత్తానికి భారతీయుడు2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎదో ఒక కాంట్రవర్సీ తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అఫిషియల్ ప్రకటన ఇ్వవలేదు...కాగా ఇలాంటి పుకార్లు ఈ మద్య కామన్ అని కొట్టి పడేసేవారు కూడా ఉన్నారు. మరి ఈ సినిమా పూర్తి అవుతుందా..కమల్ ఫ్యాన్స్ ని సంతోష పెడతారా లేదా అన్ని ముందు ముందు తెలియాల్సి ఉంది.