హీరోయిన్ శ్రీరెడ్డి నోరు సంగతి తెలిసిందే. ఆమె నోరు తెరిస్తే సంచలనాలే.. సినీరంగంలో సిగ్గు విడిచి వాస్తవాలు బయటపెట్టడంతో శ్రీరెడ్డి బాగా పాపులర్ అయ్యింది. ఆమె చెప్పేవి వాస్తవాలో కాదో కానీ.. సంచలనం మాత్రం అవుతున్నాయి. తాజాగా ఆమె డైరెక్టర్ త్రివిక్రమ్ పై, పవన్ కల్యాణ్ పై మరోసారి ఓ యూట్యాబ్ ఛానల్లో రెచ్చిపోయింది.
ఆమె ఆరోపణలు ఆమె మాటల్లోనే..
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..హీరోయిన్ పార్వతి మెల్టన్ను తీవ్రంగా వేధించాడు. అతని కారణంగా ఆమె గర్భం కూడా దాల్చింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించారు. ఆ తరవాత ఆమెకు వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ ఆమెకు రాకుండా త్రివిక్రమ్ అడ్డుకున్నాడు.
ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన పవన్ కళ్యాణ్కు ఎన్నికల్లో ఓటు వేయెద్దు.. పవన్ కళ్యాణ్ వల్ల పూనమ్ కౌర్ చాలా బాధ పడింది. ఆమె పడిన బాధలు ఇండస్ట్రీలో వారికి తెలియదు. పవన్ను పూనమ్ ఎంతగానో ఇష్టపడింది. ఆయనతో లివింగ్ రిలేషన్ షిప్ ఉంటే చాలని చెప్పింది.
పవన్ కళ్యాణ్ కారణంగా పూనమ్ ఓసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఆమె హాస్సిటల్ లో జాయిన్ అయితే పవన్ కళ్యాణే బిల్లు మొత్తం ఎందుకు పే చేసాడు.నేను ఏ హీరోతో తిరగలేదు. దర్శకుడితో ఎఫైర్ పెట్టుకోలేదు... ఇవీ శ్రీరెడ్డి తాజాగా పేల్చిన బాంబులు..