గత కొంత కాలంగా అమెరికాలో జాతి వివక్షత ఘోరంగా చూపిస్తున్నారు అక్కడి పోలీసు వారు. అబ్దుల్ కలాం, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పలువురు నటులు, రాజకీయ నాయకుల విషయంలో దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గతంలో శిల్పాషెట్టి 'బిగ్ బ్రదర్ 5' రియాల్టీ షోలో వర్ణవివక్షకు గురైంది. తాజాగా బాలీవుడ్ నటి, బిగ్ బాస్-7 ఫైనలిస్ట్ తనీషా అమెరికాలోని న్యూయార్క్ లో చేదు అనుభవం ఎదుర్కొంది. ఇటీవల అమెరికాకు వెళ్లిన ఆమె గరంలోని జేన్ హోటల్ బస చేసింది.
అక్కడ సిబ్బంది ఆమె పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడం..జాతివివక్షను చూపారు. మార్చి 10వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపింది. జేన్ హోటల్ సిబ్బంది జాత్యహంకారం గల దారుణమైన వ్యక్తులంటూ కామెంట్ చేసింది. ఓ ఛారిటీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు తనీషా న్యూయార్క్ వెళ్లింది.
ఆ సమయంలో ఆమె జేస్ హోటల్ లో బస చేసింది. తన సన్నిహితులతో హోటల్ రూమ్ లో పార్టీ చేసుకుంటున్న సమయంలో హోటల్ సిబ్బందికి చెందిన ఒక వ్యక్తి దారుణ వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై హోటల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా..వారు పట్టించుకోలేదు. కాగా, అమెరికాలో వర్ణవివక్షను ఎదుర్కోవడం తనకు ఇదే తొలిసారని తెలిపింది.