తెలుగు ఇండస్ట్రీలో దేవదాసు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హీరో రామ్. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో రెడీ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత మనోడికి ఏ చిత్రం కూడా పెద్దగా కలిసి రాలేదు. ఆ మద్య నేను శైలజా మంచి విజయం అందుకున్నా ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట.
పూరి చిత్రాల్లో ఎక్కువగా హీరో డామినేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఇస్మార్ట్ శంకర్' తో మంచి హిట్ వస్తుందని భావిస్తున్నాడు రామ్. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడనేది తాజా సమాచారం. ఇటీవల కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన చిత్రం ‘థడమ్’. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ నటించాడు.
తక్కువ బడ్జెట్ లో తెకకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.15 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడింది. చివరికి తెలుగు రీమేక్ హక్కులను స్రవంతి రవికిశోర్ దక్కించుకోగా, ఈ చిత్రం నిర్మాణంలో ఠాగూర్ మధు కూడా ఒక భాగస్వామిగా ఉండనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి అఫిషియల్ ప్రకటన త్వరలో రానుంది.